Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గాల సంరక్షణకు కట్టుబడి వున్నాం: మంత్రి వెల్లంపల్లి

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (06:43 IST)
రాష్టంలో దర్గాల సంరక్షణకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి వుంటుందని దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతొ చారిత్రాత్మక దర్గాలను ధ్వంసం చేసి ముస్లింల మనోభావాలను దెబ్బతీసి తగిన మూల్యం చెల్లించిందని పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం ప్రకాశం బారేజి సమీపములో ఉన్న హజరత్ అలీ హుస్సెన్ షా ఖాద్రీ ఉరుసు ఉత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఉరుసులో ఫ్రభుత్వం తరపున చాదర్ ను బాబావారి సమర్పించారు.

సుఫి మత గురువులు హజరత్ అల్తఫ్ అలీ రజా మంత్రి వెల్లంపల్లిని సదర స్వాగతం పలికి, ఇస్లాం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. ప్రత్యేక దువ్వా చేయించారు. బాబావారి ఆశీస్సులను అందించారు.

ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన హజరత్ అలీ హుస్సెన్ షా ఖాద్రీ దర్గా, హజరత్ హుస్సెన్ షా ఖాద్రీ దర్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

దుర్గ ఫ్లయ్ ఒవర్ నిర్మాణం కారణంగా దర్గాలు కొంత భాగం వినియోగంలో తీసుకోవడం జరిగిందని, ప్రతిఫలంగా దర్గాలను  ఒక మంచి ప్లాన్ ప్రకారం అభివృద్ది చెయ్యడం ప్రారంభించామన్నారు. కొద్దీ నెలల్లోనే ఈ దర్గాలు సర్వాంగ సుందర పర్యటక ప్రాంతాలుగా విరాజిల్లుతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments