Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు.. యువతిపై సామూహిక అత్యాచారం.. శరీరంపై గాయాలు లేవు కానీ..?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (12:32 IST)
పుట్టినరోజున ఓ యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల యువతి బుధవారం ఉదయం గుడికి బయలుదేరింది. 
 
పుట్టినరోజు కావడంతో గుడిలో దేవున్ని దర్శించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన యువతి.. రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చాలాచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇదే క్రమంలో రాత్రి పది గంటలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం పడివున్నట్టుగా సమాచారం అందింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి.. ఆ యువతి విగతజీవిగా అక్కడ పడిపోయి ఉంది.

బిడ్డను అలా చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు రోదించారు. పుట్టినరోజే చివరి రోజైందా అంటూ విలపించారు. పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కానీ మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. 
 
యువతి మృతదేహం వున్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. పక్కనే బీర్ సీసాలు ఉండటంతో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం