Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ - సికింద్రాబాద్‌ల మధ్య వారంలో ఆరు రోజులే వందేభారత్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (09:21 IST)
సికింద్రాబాద్ - వైజాగ్ స్టేషన్ల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ రైలు సేవలను ప్రారంభిస్తారు. అయితే, ఈ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఆదివారం మాత్రం రైలు సేవలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
 
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌‍లో బయలుదేరి విశాఖపట్టణానికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రం ఆగుతుంది. 
 
విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందే భారత్ రైలు రాజమండ్రికి 7.55/7.57కు, విజయవాడకు 10/10.05, ఖమ్మంకు 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్‌కు 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి వరంగల్‌కు సాయంత్రం 16.35/16.36, ఖమ్మంకు 17.45/17.46, విజయవాడకు 19.00/19.05, రాజమండ్రికి 20.58/21.00. విశాఖపట్టణంకు 23.30 గంటలకు చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments