Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ఏపీ పోలీసుల నోటీసు - వైజాగ్‌ను వీడాలంటూ అల్టిమేటం

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (14:17 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైజాగ్ పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. సాయంత్రం 4 గంటల లోపు విశాఖపట్టణాన్ని వీడాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించారు. దీంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటన తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్‌తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments