Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ఏపీ పోలీసుల నోటీసు - వైజాగ్‌ను వీడాలంటూ అల్టిమేటం

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (14:17 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వైజాగ్ పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. సాయంత్రం 4 గంటల లోపు విశాఖపట్టణాన్ని వీడాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసులను తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించారు. దీంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటన తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్‌తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments