Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్న వైకాపా ఎమ్మెల్యే!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:12 IST)
విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు తగిన శాస్తి జరిగింది. తన నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మంగళవారం జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో యలమంజలి నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా... కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 
 
రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకోవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ఈ గ్రామంలో ఎమ్మెల్యే కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తాను సూచించిన వ్యక్తినే సర్పంచ్‌గా గెలిపించాలని, ఒకవేళ ప్రత్యర్థి గెలిచినా పంచాయతీ కుర్చీలో కూర్చొనివ్వబోనని, నేలపైనే కూర్చోవాలంటూ హెచ్చరిక చేశారు. 
 
ఇదే తరహాలో వెల్చూరు పంచాయతీ వీఆర్‌ అగ్రహారంలో బెదిరించారు. అయితే వెల్చూరులో కన్నబాబు బలపరిచిన అనకాపల్లి సీతపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కిల్లాడ మంగాయమ్మ విజయం సాధించారు. మునగపాక మండలంలో ఇప్పటివరకు నాగవరం, ఆనందపురం, మూలపేట, అరబుపాలెం, రాజుపేట, గంటవాని పాలెంలో గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ వర్గీయులు విజయం సాధించి ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చారు. మునగపాకలో 14 వార్డులను ప్రసాద్‌ వర్గీయులు కైవసం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments