Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీకి విశాఖ కోర్టులో చుక్కెదురు.. అయన్న రిమాండ్‌కు తిరస్కృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (20:02 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులను ఫోర్జరీ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విశాఖ కోర్టులో గురువారం సాయంత్రం హాజరుపరిచారు. అయితే, వారిని రిమాండ్‌కు తరలించేందుకు మేజిస్ట్రేట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 2 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారన్న అభియోగాలతో వారిని గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 
 
వీరిని విశాఖపట్టణం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా, ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మేజిస్ట్రేట్ పేర్కొంటూ, వారిద్దరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. పైగా, నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేషఅ‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments