Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా ఇంటికి మీరెన్ని గంటలకు వెళ్లారు.. ఆ రోజు ఏం జరిగింది.. సీబీఐ ప్రశ్నలు

Webdunia
బుధవారం, 3 మే 2023 (09:04 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని పక్కా ఆధారాలను సేకరించేందుకు సీబీఐ ముమ్మర కసరత్తు చేసుంది. ఇందులోభాగంగా, వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి వద్ద మరోమారు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. హైదరాబాద్‌లోని  సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఇందులో వివేకా హత్య జరిగిన రోజున ఏం జరిగింది? ఆ రోజున వివేకా ఇంటికి మీరు ఎన్ని గంటలకు వెళ్లారు? వెళ్లాక అక్కడ మొదట ఏం చూశారు?, విషయం ఎవరెవరికి చెప్పారు? ముందుగా అక్కడకు వచ్చిందెవరు? ఆ లేఖలే ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇప్పటివరకు కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించిన సీబీఐ.. సాక్షులుగా ఉన్న వారినీ పిలిచి విచారిస్తోంది. ఇప్పుడు కృష్ణారెడ్డి వంతు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు ప్రత్యేక బృందం కృష్ణారెడ్డిని విచారించింది. హత్య విషయం తెలుసుకున్న వైఎస్ అవినాశి రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్న తర్వాత ఏం మాట్లాడారు.. ఏం చేశారని అడిగినట్లు సమాచారం. 
 
'వివేకా గదిలో గుర్తించిన లేఖలో ఏం రాసి ఉంది.. అందులో ఉన్న విషయం మీరు ఎవరెవరికి చెప్పారు? ఎవరి ఆదేశాల మేరకు లేఖ దాచారు.. ఇంట్లో గుర్తించిన సెల్ఫోన్ ఎవరిది' ఇలా అనేక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments