మమ్మల్ని రామతీర్థం పంపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది: విష్ణువర్ధన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (18:04 IST)
చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి వేదికగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందన్నారు. జరగబోయే పరిణామాలకు సిఎం జగన్ నైతిక బాధ్యత వహించాలన్నారు.
 
రామతీర్థం కొండమీదికి టిడిపి, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. పోలీసులు వైసిపి కండువాలు కప్పుకుని డ్యూటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలీసులకు జీతాలు ఇస్తోంది వైసిపి ఆఫీసా, లేక రాష్ట్రప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు.
 
ఎపిలో మానవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 60 యేళ్ళ వయస్సున్న సోము వీర్రాజుని అరెస్టు చేయడం జగన్ పిరికిపంద చర్య అన్నారు. ఎపిలో పోలీసుల ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే వరుస సంఘటనలు జరుగుతున్నాయన్నారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments