Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పట్టాలెక్కనున్న విశాఖ - కాచికూడ ఎక్స్‌ప్రెస్

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (09:58 IST)
విశాఖపట్టణం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ నెల 15 నుంచి ఈ రైలు సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కరోన వైరస్ వ్యాప్తి, ప్రయాణాలపై ఆంక్షలు, లాక్డౌన్ కారణంగా ప్రయాణికుల నుంచి ఆదరణలేక పోవడంతో పలు రైళ్లను రైల్వే శాఖ ఇటీవల రద్దు చేసింది. వీటిలో విశాఖపట్టణం - కాచిగూడ రైలు కూడా ఉంది. 
 
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా అనేక రైలు సర్వీసులను రైల్వే శాఖ పునరుద్ధరిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో విశాఖ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును తిరిగి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు గురువారం (15వ తేదీ) సాయంత్రం 6.40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 
 
అలాగే, తిరుగు మార్గంలో 16న సాయంత్రం 6.25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments