Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై మద్యం మత్తులో మహిళ చీర లాగేసిన యువకులు

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (12:16 IST)
విశాఖ జిల్లాలో ఓ మహిళకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆమె చీర లాగేసి నలుగురిలో ఆమెను అవమానపరిచారు. అంతేకాదు, కులం పేరుతో ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నంకు చెందిన నానిబాబు స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజుతో కలిసి ఆటోలో నర్సీంపట్నం ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో వెనకాల వచ్చిన ఓ బైక్ ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ట్రాఫిక్ సమస్య కారణంగా నాని సైడ్ ఇవ్వకపోవడంతో.. కొంతదూరం వెళ్లాక బైక్‌పై ఉన్న యువకులు ఆటోను అడ్డగించారు. 
 
ఆటోలో నుంచి నానిని బయటకు లాగి చితకబాదారు. అడ్డుకోబోయిన అతని భార్య రాజేశ్వరి చీర లాగేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను బొడగ రామకృష్ణ, ఎలిశెట్టి రామకృష్ణలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments