Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై మద్యం మత్తులో మహిళ చీర లాగేసిన యువకులు

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (12:16 IST)
విశాఖ జిల్లాలో ఓ మహిళకు అవమానం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆమె చీర లాగేసి నలుగురిలో ఆమెను అవమానపరిచారు. అంతేకాదు, కులం పేరుతో ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నంకు చెందిన నానిబాబు స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం భార్య రాజేశ్వరి, సోదరుడు అప్పలరాజుతో కలిసి ఆటోలో నర్సీంపట్నం ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో వెనకాల వచ్చిన ఓ బైక్ ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ట్రాఫిక్ సమస్య కారణంగా నాని సైడ్ ఇవ్వకపోవడంతో.. కొంతదూరం వెళ్లాక బైక్‌పై ఉన్న యువకులు ఆటోను అడ్డగించారు. 
 
ఆటోలో నుంచి నానిని బయటకు లాగి చితకబాదారు. అడ్డుకోబోయిన అతని భార్య రాజేశ్వరి చీర లాగేశారు. కులం పేరుతో దుర్భాషలాడారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను బొడగ రామకృష్ణ, ఎలిశెట్టి రామకృష్ణలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments