Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో పోవాలి.. సైకిల్ రావాలి... వైకాపా ఎమ్మెల్యేకు ఎంఎస్ బాబుకు షాక్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (15:55 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్థులు షాకిచ్చారు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పోస్టర్లు కనిపించాయి. ఆదేసమయంలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే పాట మైకులో హోరెత్తుతోంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. 
 
గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివా రిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది. వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని ఆ పాటను ఆపాలని గ్రామస్థులకు సూచించారు. వారు అంగీకరించలేదు. పైగా 'మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకొచ్చారు? ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?' అంటూ కారులోంచి దిగని ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించారు. 
 
ఆ వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పాటను నిలిపి వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో 90 ఇళ్లు ఉండగా, రెండు ఇళ్లకు వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. మొగిలివారిపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైన నిరసన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments