Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రతి ఒక్క సేవను ప్రభుత్వం అందిస్తుంది. అయితే, పలు ప్రాంతాల్లో ఈ సచివాలయకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవలు చాలు.. ఇక దయచేయండి అంటూ సచివాలయానికి తాళం వేశారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండ పంచాయతీ పరిధిలో బైలుపత్తికొండ, గార్లపెంట మజరా గ్రామాలు ఉన్నాయి. డి.కోటకొండ గ్రామంలో మూడు వేలకు పైనే జనాభా ఉన్నారు. ప్రధాన కాలనీల్లో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. 
 
శనివారం గ్రామస్థులు బాషా, బడేసాబ్‌, రాజాసాహెబ్‌, మల్లన్న, వీరేష్‌, రంగన్న, హనుమంతు, రత్నమ్మ, సారమ్మ, మలేశ్వరమ్మతో పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలసి మూకుమ్మడిగా సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేసి ఎదుట ధర్నా చేపట్టారు. 
 
వర్షం నీరు కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం వరకు మండల అధికారులు రాలేదు. సమస్య పరిష్కరించే వరకు గ్రామ సచివాలయం తెరవనివ్వమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments