Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రతి ఒక్క సేవను ప్రభుత్వం అందిస్తుంది. అయితే, పలు ప్రాంతాల్లో ఈ సచివాలయకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవలు చాలు.. ఇక దయచేయండి అంటూ సచివాలయానికి తాళం వేశారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండ పంచాయతీ పరిధిలో బైలుపత్తికొండ, గార్లపెంట మజరా గ్రామాలు ఉన్నాయి. డి.కోటకొండ గ్రామంలో మూడు వేలకు పైనే జనాభా ఉన్నారు. ప్రధాన కాలనీల్లో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. 
 
శనివారం గ్రామస్థులు బాషా, బడేసాబ్‌, రాజాసాహెబ్‌, మల్లన్న, వీరేష్‌, రంగన్న, హనుమంతు, రత్నమ్మ, సారమ్మ, మలేశ్వరమ్మతో పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలసి మూకుమ్మడిగా సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేసి ఎదుట ధర్నా చేపట్టారు. 
 
వర్షం నీరు కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం వరకు మండల అధికారులు రాలేదు. సమస్య పరిష్కరించే వరకు గ్రామ సచివాలయం తెరవనివ్వమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments