Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రతి ఒక్క సేవను ప్రభుత్వం అందిస్తుంది. అయితే, పలు ప్రాంతాల్లో ఈ సచివాలయకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవలు చాలు.. ఇక దయచేయండి అంటూ సచివాలయానికి తాళం వేశారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండ పంచాయతీ పరిధిలో బైలుపత్తికొండ, గార్లపెంట మజరా గ్రామాలు ఉన్నాయి. డి.కోటకొండ గ్రామంలో మూడు వేలకు పైనే జనాభా ఉన్నారు. ప్రధాన కాలనీల్లో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. 
 
శనివారం గ్రామస్థులు బాషా, బడేసాబ్‌, రాజాసాహెబ్‌, మల్లన్న, వీరేష్‌, రంగన్న, హనుమంతు, రత్నమ్మ, సారమ్మ, మలేశ్వరమ్మతో పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలసి మూకుమ్మడిగా సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేసి ఎదుట ధర్నా చేపట్టారు. 
 
వర్షం నీరు కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం వరకు మండల అధికారులు రాలేదు. సమస్య పరిష్కరించే వరకు గ్రామ సచివాలయం తెరవనివ్వమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments