Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాల వద్ద రూ.లక్షన్నర మోసం చేసిన వాలంటీర్...

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (14:16 IST)
వెస్ట్ గుంటూరు జిల్లాలో ఒక వాలంటీరు హిజ్రాల లక్షన్నర రూపాయలు తీసుకుని పారిపోయాడు. రూ.2 వేల నోట్లు మార్చి ఇస్తామని నమ్మించి ఈ మోసానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతకాలంగా సదరు వాలంటీరు హిజ్రాలతో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లు ఉంటే తనకివ్వాలని, బ్యాంకులో తనకు తెలిసిన వారు ఉన్నారని, వారు ఎంతైనా మారుస్తారని హిజ్రాలను నమ్మించాడు. 
 
వాలంటీర్ మాటలు నమ్మిన హిజ్రాలు రూ.3 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇచ్చారు. ఆ నోట్లను మార్చి వారికి రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ నెలాఖరుతో రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకునే గడువు ముగియడంతో మరోసారి రూ.లక్షన్నర విలువైన రూ.2 వేల నోట్లు వలంటీరు అందించారు. దీంతో రూ.లక్షన్నర పెద్ద నోట్లతో సదరు వలంటీర్ హైదరాబాద్ ఉడాయించాడు. 
 
ఈ విషయం తెలుసుకుని కొందరు హిజ్రాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. అతడిపై స్థానిక పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదిచ్చినట్లు హిజ్రాలు తెలిపారు. వాలంటీర్ వ్యవహారం బయటకు పొక్కితే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని కొందరు అధికార పార్టీ నాయకులు కావాలనే ఈ ఉదంతాన్ని కప్పిపెడుతున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. పరారీలో ఉన్న వాలంటీర్‌‍ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత హిజ్రాలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments