Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొత్తం మార్కులు 2 వేలు... వేసిన మార్కులు 5,360

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (09:11 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ దశాబ్దపు వింత చోటుచేసుకుంది. మొత్తం మార్కులు 800 అయితే, జవాబు పత్రాల మూల్యాంకన తర్వాత వేసిన మార్కులు 5360. ఈ మార్కులను చూసిన సదరు విద్యార్థికి కళ్లు బైర్లు కమ్మాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ విశ్వవిద్యాలయంలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ తప్పులు తడకగా ఉండటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
మొత్తం మార్కులు 800 అయితే, పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ముఖ్యంగా ఓ విద్యార్థికి అయితే, ఏకంగా 5,362 మార్కులు వచ్చాయి. వీటిని చూసిన ఆ విద్యార్థి నోరెళ్లబెట్టాడు. 
 
జవాబు పత్రాల మూల్యాంకన, మార్కుల లెక్కింపులో యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా లేదు. ఈ ఘటనపై యూనవర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మార్కులు జాబితాలో తప్పులుంటే సవరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments