Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ, పెళ్లికి నో చెప్పింది- నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి..

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:07 IST)
తాడేపల్లిలో నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేశాడు. నర్సుగా పనిచేస్తున్న ఇరవై మూడేళ్ల మహిళపై ఓ ప్రేమోన్మాది చేసిన ఈ బ్లేడ్ దాడి స్థానికంగా కలకలం రేపింది. వడ్డేశ్వరంలోని హాస్టల్ సమీపంలో దుండగుడు ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తోంది. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం, చర్చి నుండి తిరిగి హాస్టల్‌కి వస్తుండగా క్రాంతి మౌళి అనే యువకుడు ఆమెతో మాట్లాడాలని కోరాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామని అడిగాడు. 
 
కానీ క్రాంతి మౌళి ప్రేమకు నర్సు నో చెప్పింది. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన క్రాంతి మౌళి బ్లేడ్‌తో దాడి చేసి మెడపై కోసేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments