Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ముంపులో ప్రసవించిన మహిళ.. చలించిన పోలీస్ కమిషనర్... స్వయంగా వెళ్లి...

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:06 IST)
విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌ నగర్‌ మూడు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌ వద్ద వరద ముంపులోనే ఓ ఇంట్లో మహిళ ప్రసవించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు స్వయంగా బోటులో వెళ్లి తల్లీబిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చిన అధికార యంత్రాంగానికి ప్రజలు అభినందనలు తెలిపారు. 
 
ఇదిలావుంటే, వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. అయితే, ఈ పనుల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కోటేశ్వర రావు అనే విద్యుత్ లైన్‌మెన్ వరద నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతిని తెలిపారు. భార్య మాధవి, కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. లైన్‌మెన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగర సమీపంలోని బుడమేరు ఉప్పొంగి అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments