Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశావ్ కదా... 20 యేళ్లు జైల్లోనే ఉండు...

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (08:41 IST)
బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలిన ఓ కామాంధుడికి 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఐదు వేల రూపాయల అపరాధం కూడా విధించింది. అలాగే, బాధితురాలికి రూ.5 లక్షల మేరకు పరిహారం ఇచ్చేలా చూడాలని ఆదేశించింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి గ్రామానికి చెందిన సంగెపు నవీన్ (23) అనే వ్యక్తి గత 2019 సెప్టెంబరు 16వ తేదీన స్థానికంగా ఉండే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను నయానో భయానో బెదిరించాడు. 
 
అయితే, అత్యాచారం ఇంటికి వచ్చిన ఆ బాలిక నీరసంగా, ముభావంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన విజయవాడలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ రజిని తీర్పును వెలువరించారు. 
 
ముద్దాయికి 20 యేళ్ల జైలుతో పాటు 5 వేల రూపాయల అపరాధం కూడా విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే, బాధిత బాలికకు 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments