Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో తిరిగి పాస్‌పోర్టు సేవలు ప్రారంభం

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడలో తిరిగి పాస్‌పోర్టు సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, ఈ కేంద్రం నుంచి అందిస్తూ వచ్చిన పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో కేవలం అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో విజ‌య‌వాడ‌లో పాస్‌పోర్టు సేవ‌లకు బ్రేక్ వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అత్య‌వ‌స‌ర ప‌నుల‌పై విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అధికారులు పాస్ పోర్టు సేవ‌లను తిరిగి ప్రారంభించారు. అత్య‌స‌ర‌మైన వారికి సేవ‌లందించాల‌న్న ల‌క్ష్యంతో రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు. 
 
ఇదిలావుంటే, సాధార‌ణ రోజుల్లో అధికారులు రోజుకు స‌గ‌టున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్‌ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శ్రీనివాస్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments