Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి మృతిలో కలకలం.. అధికారుల గుండెల్లో రైళ్లు...

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (09:27 IST)
విజయవాడ నగరంలో గుండె జబ్బుతో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె అంత్యక్రియల సమయంలో సుమారుగా 60 మంది వరకు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చనిపోయిన వృద్ధురాలికి 75 యేళ్లతో పాటు... హృద్రోగంతో బాధపడుతున్నది. దీంతో ఆమె గుండె జబ్బు కారణంగానే చనిపోయివుంటుందని భావించారు. కానీ, ఆ వృద్ధురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలకు హాజరైనవారు భయంతో వణికిపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ నగరంలోని గాంధీ నగర్‌కు చెందిన మహిళ ఈనెల 11వ తేదీన గుండె జబ్బుతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. 75 సంవత్సరాల వయసు ఉండటంతో గుండె జబ్బు మాత్రమే ఉంటుందని భావించిన వైద్యులు చికిత్స చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆ వృద్ధురాలు మృతి చెందింది. 
 
ఈ నెల 13న కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వృద్ధురాలికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14న వచ్చిన రిపోర్ట్స్‌తో పాజిటివ్ అని తేలింది. ఆ అంతిమ సంస్కారాలకు 60 మంది సన్నిహితులు, పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. రిపోర్ట్‌తో ఒక్కసారిగా గాంధీనగర్‌లో కలకలం రేగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments