Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి మృతిలో కలకలం.. అధికారుల గుండెల్లో రైళ్లు...

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (09:27 IST)
విజయవాడ నగరంలో గుండె జబ్బుతో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె అంత్యక్రియల సమయంలో సుమారుగా 60 మంది వరకు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చనిపోయిన వృద్ధురాలికి 75 యేళ్లతో పాటు... హృద్రోగంతో బాధపడుతున్నది. దీంతో ఆమె గుండె జబ్బు కారణంగానే చనిపోయివుంటుందని భావించారు. కానీ, ఆ వృద్ధురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అంత్యక్రియలకు హాజరైనవారు భయంతో వణికిపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ నగరంలోని గాంధీ నగర్‌కు చెందిన మహిళ ఈనెల 11వ తేదీన గుండె జబ్బుతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. 75 సంవత్సరాల వయసు ఉండటంతో గుండె జబ్బు మాత్రమే ఉంటుందని భావించిన వైద్యులు చికిత్స చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆ వృద్ధురాలు మృతి చెందింది. 
 
ఈ నెల 13న కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వృద్ధురాలికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14న వచ్చిన రిపోర్ట్స్‌తో పాజిటివ్ అని తేలింది. ఆ అంతిమ సంస్కారాలకు 60 మంది సన్నిహితులు, పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. రిపోర్ట్‌తో ఒక్కసారిగా గాంధీనగర్‌లో కలకలం రేగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments