Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం ఖాళీ చేస్తామని అద్దెకు దిగారు.. తీరాచూస్తే...

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:48 IST)
విజయవాడ నగరంలో విషాదం జరిగింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకున్నారు. తీరా సాయంత్రం లాడ్జి సిబ్బంది వెళ్ళి చూస్తే ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్నారు. 
 
ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని ఓ లాడ్జికి రెండు రోజుల క్రితం ఓ ప్రేమజంట వచ్చింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అయితే, ఏంజరిగిందో ఏమో తెలియదుగానీ, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును వారిద్దరూ సేవించారు. 
 
అయితే, సాయంత్రం గదిని ఖాళీ చేస్తామన్న ప్రేమ జంట ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపులు తట్టగా వారు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ప్రేమజంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ప్రియురాలు చనిపోయింది. 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments