Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం ఖాళీ చేస్తామని అద్దెకు దిగారు.. తీరాచూస్తే...

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (10:48 IST)
విజయవాడ నగరంలో విషాదం జరిగింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకున్నారు. తీరా సాయంత్రం లాడ్జి సిబ్బంది వెళ్ళి చూస్తే ఆ ప్రేమ జంట పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడివున్నారు. 
 
ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని ఓ లాడ్జికి రెండు రోజుల క్రితం ఓ ప్రేమజంట వచ్చింది. సాయంత్రం ఖాళీ చేస్తామంటూ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అయితే, ఏంజరిగిందో ఏమో తెలియదుగానీ, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును వారిద్దరూ సేవించారు. 
 
అయితే, సాయంత్రం గదిని ఖాళీ చేస్తామన్న ప్రేమ జంట ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపులు తట్టగా వారు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆ ప్రేమజంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వీరిలో ప్రియురాలు చనిపోయింది. 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments