Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పీక కోసి హత్య... చున్నీతో పిల్లలను కడతేర్చిన కర్కశకుడు!

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (09:56 IST)
కట్టుకున్న భార్యపై అనుమానమో.. అసహనమో... అప్పుల బాధో తెలియదుగానీ... భార్యను కత్తితో పీక కోసం చంపేశాడు. తన ఇద్దరు పిల్లలను చున్నీతో ఉరిబిగించి కడతేర్చాడో కర్కశకుడు. ఈ దారుణం విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ వాంబేకాలని డీ బ్లాకు ప్లాటు నెంబరు 373లో ఉల్లిపాయల వ్యాపారం చేసే బుగతా మోహన్‌కు భార్య నీలవేణి (26), బాబు రేవంత్‌కుమార్‌ అలియాస్‌ సాయి (7), పాప ఝాన్సీ ఉన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, ఇతర చెడు వ్యసనాలకు బానిసయిన మోహన్‌ తరచూ అప్పులపాలవుతుంటాడు. బుధవారం రాత్రి 10 గంటల వరకు భార్యభర్తలు మాట్లాడుకుంటూ పిల్లలు సాయి, ఝాన్సీని పిలిచి ఇంట్లోకి తీసుకుని వెళ్లిపోయారు. 
 
గురువారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళం వేసి ఉండగా ఏసీ పని చేస్తుండటంతో అనుమానం వచ్చిన పక్కింటి వారు కిటికీలో నుంచి చూశారు. ఇద్దరు పిల్లలు మంచంపై పడి ఉండటం, భార్య రక్తపుమడుగులో కనిపించడంతో వెనుక తలుపు తొలగించి లోపలకు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసుల విచారణలో భర్త మోహన్‌ హత్య చేసి పరారాయినట్లు తేలింది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనకు రూ.15 లక్షలు అప్పులున్నాయని, భార్య, పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వేట్రాకు వద్దకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెప్పినట్లు సమాచారం. 
 
అప్పుల సమస్యతోనే ఘాతుకానికి పాల్పడ్డాడా.. ఇతరత్రా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నీలవేణి తల్లిదండ్రులు ఒరిస్సా సమీపంలో ఉండటంతో వారికి సమాచారం అందించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments