Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు.. ఇంటి వెనుకనే పాతిపెట్టిన భర్త

విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో

Webdunia
సోమవారం, 15 మే 2017 (09:51 IST)
విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో కుమార్తె మరియమ్మ (30)కు అదేప్రాంతంలో విద్యుత్‌ పనులు నిర్వహించే దుర్గాప్రసాద్‌(35)తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుర్గాప్రసాద్‌ స్థానిక రాజీవ్‌నగర్‌లో నివసించే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరియమ్మ భర్తను నిలదీయడంతో భార్యను భర్త వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మరియమ్మ నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
 
ఈపరిస్థితుల్లో దుర్గాప్రసాద్‌ భార్యను కలిసి.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని, పూర్తిగా మారిపోయానంటూ నమ్మపలికాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండు నెలల క్రితం వాంబే కాలనీలో అద్దెకు దిగారు. రెండురోజుల గడిచిన తర్వాత భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అదేసమయంలో భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. 
 
అదనుచూసి ఒకరోజు మరియమ్మ మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఐదడుగుల మేర గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. మరుసటిరోజు ఉదయం తాపీ కార్మికులను పిలిపించి.. ఆ గోతిపై గట్టు నిర్మించాడు. నాటి నుంచి భార్య వివరాలు అడిగిన ఇరుగుపొరుగుకు ఏవో కారణాలు చెబుతూ వచ్చాడు. 
 
కుమార్తె నెల రోజులుగా కనిపించకపోవడంతో మృతురాలి తల్లి కుమారమ్మ శనివారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. అల్లుడిపై అనుమానంగా ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments