Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ... మూడో రైల్వే లైన్ ప్రారంభం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (17:26 IST)
దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన విజయవాడ - గూడూరు గ్రాండ్‌ ట్రంక్‌ మార్గం దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర, తూర్పు ప్రాంతాలను అనుసంధానించే రైలు మార్గంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ నిరంతరం రైళ్ల రాకపోకలతో రద్దీ పెరగడంతో ఈ సెక్షనపై ఒత్తిడి పెరిగింది.  ప్రధానమైన ఈ రైల్వే లైన్‌లో రద్దీని నివారించడానికి ఈ మార్గంలో విద్యుదీకరణతో సహా మూడవ రైల్వే లైను పనులు న‌డుస్తున్నాయి. తలమంచి, వెంకటేశ్వరపాలెం మధ్య 24.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. 
 
 
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ`గూడూరు సెక్షన్‌లో ప్రయాణికుల సరుకు రవాణా రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతుండడంతో ఇక్కడ రద్దీ పెరిగింది. కీలకమైన ఈ సెక్షన్‌లో రద్దీని తగ్గించడానికి విజయవాడ - గూడూరు మధ్య 288 కి.మీల మేర రూ.3246 కోట్ల అంచనా వ్యయంతో మూడవ లైన్‌ ప్రాజెక్టు 2015`16 సంవత్సరంలో మంజూరైంది. ఈ పనులను ఆర్‌విఎన్‌ఎల్‌ వారిచే మూడు ప్యాకేజీలలో నిర్వహిస్తున్నారు. గూడురు -బిట్రగుంట మ‌ధ్య‌ 75 కి.మీలు, బిట్రగుంట-కరవది  89 కి.మీలు, కరవది`కృష్ణా కెనాల్‌ (విజయవాడ) `124 కి.మీలు. మొత్తం మూడు ప్యాకేజీలలోని పనులు ఏకకాలంలో సాగుతున్నాయి. 
 
 
రెండవ ప్యాకేజీలో ఉలవపాడు`కావలి సెక్షన్‌ మధ్య 30 కి.మీలు మేర పనులు మార్చి 2021లో  పూర్తయ్యాయి. ఇప్పుడు తలమంచి`బిట్రగుంట`వెంకటేశ్వరాపాలెం మధ్య 24.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో కీలకమైన ఈ ప్రాజెక్టులో మొత్తం 54.8 కి.మీల మేర పనులు పూర్తయ్యాయి. 
 
 
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ట్రిప్లింగ్‌, విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్‌, ఆర్‌విఎన్‌ఎల్‌ సిబ్బందిని అభినందించారు. విజయవాడ ` గూడూరు ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ మార్గంలో రద్దీని అధిగమించవచ్చని, ఈ మార్గంలో మరిన్ని రైళ్ల రాకపోకలను కొనసాగించేందుకు మరింత వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రాండ్‌ ట్రంక్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు మూడవ రైల్వే లైన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి పనులు చేపడుతున్నట్లు, అవి వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments