Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో రెచ్చిపోతున్న ఈవ్‌టీ(నే)జర్స్

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని బెజవాడలో ఈవ్ టీజర్స్ రెచ్చిపోతున్నారు. వీరి నుంచి అమ్మాయిలు, మహిళలకు వేధింపులు ఎక్కువైపోయాయి. ఈ తరహా పోకిరీలను ఆటకట్టించే విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తుండటంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. 
 
ప్రధానంగా విజయవాడలోని బెంజి సర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్ కళాశాలల విద్యార్థినులు సాయంత్రం అక్కడి బస్టాపులో ఇళ్లకు వెళ్లేందుకు వేచి ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. అలాగే, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, వన్‌టౌన్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.
 
గడచిన రెండేళ్ళ కాలంలో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల, వేధింపులు, అసభ్యం, అశ్లీలంగా వ్యవహరించిన కేసులు 1,958 వరకు నమోదయ్యాయి. వీటిలో చాలావరకు కేసులు భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించినవే ఉన్నాయి. అలాగే, 90 శాతం పైగా రాజీ అయ్యారు. వీటిలో ఈవ్‌టీజింగ్‌ కేసులు, ఫొక్సో చట్టం కింద నమోదైన కేసులు, రేప్‌ అనంతరం హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం 61 మందికి జైలు శిక్ష విధించింది. మరరో 626 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments