Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ పేరును ప్రస్తావించని ఎంపీ విజయసాయి రెడ్డి... పీఎం కిసాన్‌పై ప్రశంసలు

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (10:30 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మనస్సు మారిందా? కరుడుగట్టిన వైకాపా నేతగా ఉండే ఆయన.. తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఎస్ఆర్ పేరును ప్రస్తావించకుండానే పీఎం కిసాన్ పథకంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది వైకాపా శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ కింద రూ.16800 కోట్లు విడుదల చేయడాన్ని విజయసాయి ట్విటర్‌లో కొనియాడారు. పీఎం కిసాన్‌పై ఆయన చేసిన ట్వీట్ ఇపుడు అమితాసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13500ను అర్హులైన లబ్దిదారులకు అందిస్తున్నారు. 
 
ఈ పథకాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్‌గా పేర్కొంటూ ప్రచారం కల్పిస్తున్నారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఈ నిధులను విడుదల చేశారు. అయితే, విజయసాయి రెడ్డి కేవలం పీఎం కిసాన్‌పై ట్వీట్ చేయడం విశేషం. ఈ పథకం కింద 8 కోట్లపకు పైగా రైతులకు యేడాదికి రూ.6 వేలు చొప్పున అందుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇది గొప్ప సహాయకారిగా నిలుస్తుందన్నారు. ప్రధాని మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని తాను అభినందిస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments