బాలుడి ప్రాణం తీసిన నులిపురుగుల మందు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (10:40 IST)
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నులిపురుగుల మందు ఓ చిన్నారి ప్రాణంతీసింది. చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు చావడానికి పోసే మందే.. చివరకు ఆ చిన్నారి ప్రాణమే తీసింది. ఇందుకు కారణమైన ఏఎన్ఎంతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగిని వైద్యాధికారులు సస్పెండ్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాడు. ఇందులోభాగంగా రామినాయుడువలస గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. 
 
ఈ శిబిరంలో అంగన్‌వాడీ, ఏఎన్ఎంలు చిననారులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ళ బాలుడు కొట్నాన జశ్విక్ నాయుడును నాన్నమ్మ శిబిరం వద్దకు తీసుకొచ్చింది. 
 
మేము త్వరగా వెళ్లిపోవాలని, మాత్ర ఇవ్వాలని కోరింది. అంగన్‌వాడీ వర్కరు, ఏఎన్ం ఓ మాత్ర తీసి ఆమెకు ఇచ్చారు. బాలుడికి సగం ముక్క వేయాలని సూచించారు.

వారు చెప్పినట్టుగానే మాత్రను రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని బాలుడికి వేసింది. మాత్ర మింగించిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments