Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి ప్రాణం తీసిన నులిపురుగుల మందు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (10:40 IST)
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నులిపురుగుల మందు ఓ చిన్నారి ప్రాణంతీసింది. చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు చావడానికి పోసే మందే.. చివరకు ఆ చిన్నారి ప్రాణమే తీసింది. ఇందుకు కారణమైన ఏఎన్ఎంతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగిని వైద్యాధికారులు సస్పెండ్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాడు. ఇందులోభాగంగా రామినాయుడువలస గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. 
 
ఈ శిబిరంలో అంగన్‌వాడీ, ఏఎన్ఎంలు చిననారులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ళ బాలుడు కొట్నాన జశ్విక్ నాయుడును నాన్నమ్మ శిబిరం వద్దకు తీసుకొచ్చింది. 
 
మేము త్వరగా వెళ్లిపోవాలని, మాత్ర ఇవ్వాలని కోరింది. అంగన్‌వాడీ వర్కరు, ఏఎన్ం ఓ మాత్ర తీసి ఆమెకు ఇచ్చారు. బాలుడికి సగం ముక్క వేయాలని సూచించారు.

వారు చెప్పినట్టుగానే మాత్రను రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని బాలుడికి వేసింది. మాత్ర మింగించిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments