ఎస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు-బాబుపై సాయి ధ్వజం

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (16:05 IST)
ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన వ్యవహారం‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఎస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశాడని 1300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. 
 
ఎస్ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా చంద్రబాబు దోచిపెట్టాడని ఇలాంటి దోపిడీలు ఇంకెన్ని ఉన్నాయోనని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన ఆరోపణలకు ఆధారంగా ఎస్ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు.
 
అలాగే స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై ప్రతాప రెడ్డితో బాబు కేసు వేయించి కొట్టేయించారని.. అంతేకాకుండా బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెట్టారని విజయసాయి ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికలు జరగకూడదనేదే బాబు దురుద్దేశమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments