Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఒక్కరే మోదీపై పోరాటం చేస్తుంటే.. జగన్, కేసీఆర్‌లు? వీహెచ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:05 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది రోజున వీహెచ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందని వీహెచ్ విమర్శించారు. 
 
ఎన్నికల సంఘం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం కూడా అందులో భాగమేనని చెప్పారు. ఎన్నికలకు నాలుగురోజుల ముందు సీఎస్‌ను మార్చడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తించడాన్ని తానెప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మాత్రం ఏపీ తరహాలో అధికారులను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. 
 
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని బయట తిడుతున్న కేసీఆర్ లోపల మాత్రం అడ్జస్ట్ మెంట్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని ఓవైపు కేసీఆర్ తిడుతుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. పాత కేసులను మాఫీ చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments