Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఒక్కరే మోదీపై పోరాటం చేస్తుంటే.. జగన్, కేసీఆర్‌లు? వీహెచ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:05 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది రోజున వీహెచ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందని వీహెచ్ విమర్శించారు. 
 
ఎన్నికల సంఘం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం కూడా అందులో భాగమేనని చెప్పారు. ఎన్నికలకు నాలుగురోజుల ముందు సీఎస్‌ను మార్చడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తించడాన్ని తానెప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మాత్రం ఏపీ తరహాలో అధికారులను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. 
 
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని బయట తిడుతున్న కేసీఆర్ లోపల మాత్రం అడ్జస్ట్ మెంట్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని ఓవైపు కేసీఆర్ తిడుతుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. పాత కేసులను మాఫీ చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments