Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి - వీర భూమి - ప్రధానమంత్రి మోడీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (14:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పుణ్య భూమి, వీర భూమి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అందుకే ఈ భూమికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్య సాధనంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాన మోడీ సోమవారం జిల్లాలోని పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. 'ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 
 
యావత్‌ భారతదేశం తరపున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక ఆయన. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌ త్యాగధనులకు నమస్కరిస్తున్నా. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను స్మరించుకుంటున్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. మనమంతా ఒకటే అన్న భావనతో ఉద్యమం జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments