Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డను బెదిరించలేదు : వెంకటరామిరెడ్డి వివరణ

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (17:01 IST)
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బెదిరించినట్టు వచ్చిన వార్తలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. 
 
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'కరోనాతో ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాం. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలే కానీ.. నిమ్మగడ్డను ఉద్దేశించినవి కావు. నిమ్మగడ్డ కోరినట్లు నాపై పోలీసులు నిఘా పెట్టినా అభ్యంతరం లేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని చెప్పాం. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటి?. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా?. పంచాయతీ ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు' అని చెప్పుకొచ్చారు. 
 
అంతకుముందు.. కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతానికి సాధ్యం కాదంటున్నా మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 
 
ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సహా వివిధ ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం వేర్వేరుగా మాట్లాడుతూ నోటిఫికేషన్‌ విడుదలను తప్పుపట్టారు. ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటని ఆక్రోశం వెలిబుచ్చారు. 
 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని కోరారు. తమ వినతిని పట్టించుకుని నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments