Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో స్థానిక పోరుకు నోటిఫికేషన్.. ఏపీలో వద్దని కోర్టుకెక్కిన సర్కారు

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదు. దీంతో ఎన్నికలను నిలిపివేయాలంటూ న్యాయపోరాటానికి దిగింది. ఇందులో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలను కోరుతూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో రేపు ఏం జరగబోతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments