ఎన్టీఆర్ వెన్నుపోటు..ఆ ఆరుగురు మహిళలే కారణం.. వెంకయ్య

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:08 IST)
కృష్ణా జిల్లా పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తులు కేంద్రాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ గద్దె దిగడానికి కొన్ని నెలల ముందు సీనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడు కొందరు మహిళలు ఆయనను కలిశారన్నారు. ఆ సమయంలో వాళ్లు ఆయన కాళ్లు మొక్కారని చెప్పుకొచ్చారు. 
 
వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని.. అందుకు ఆయన అదంతా వారి ప్రేమ, అభిమానం అని సమాధానం ఇచ్చారని వెంకయ్య చెప్పారు. అది అభిమానం కాదని అప్పట్లో ఆయనకు చెప్పానని.. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత జరిగిన వెన్నుపోటు వ్యవహారంలో ఆయన కాళ్లు మొక్కిన ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని వెల్లడించారు. అయితే ఆ మహిళలు ఎవరు అనే విషయాన్ని మాత్రం తాను చెప్పబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అంశంపై కొంతకాలం క్రితం వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. దీంతో ఈ అంశంపై ఎన్నుడూ లేని విధంగా  బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments