Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ వెన్నుపోటు..ఆ ఆరుగురు మహిళలే కారణం.. వెంకయ్య

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:08 IST)
కృష్ణా జిల్లా పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తులు కేంద్రాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ గద్దె దిగడానికి కొన్ని నెలల ముందు సీనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడు కొందరు మహిళలు ఆయనను కలిశారన్నారు. ఆ సమయంలో వాళ్లు ఆయన కాళ్లు మొక్కారని చెప్పుకొచ్చారు. 
 
వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని.. అందుకు ఆయన అదంతా వారి ప్రేమ, అభిమానం అని సమాధానం ఇచ్చారని వెంకయ్య చెప్పారు. అది అభిమానం కాదని అప్పట్లో ఆయనకు చెప్పానని.. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత జరిగిన వెన్నుపోటు వ్యవహారంలో ఆయన కాళ్లు మొక్కిన ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని వెల్లడించారు. అయితే ఆ మహిళలు ఎవరు అనే విషయాన్ని మాత్రం తాను చెప్పబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అంశంపై కొంతకాలం క్రితం వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. దీంతో ఈ అంశంపై ఎన్నుడూ లేని విధంగా  బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments