Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ వెన్నుపోటు..ఆ ఆరుగురు మహిళలే కారణం.. వెంకయ్య

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (12:08 IST)
కృష్ణా జిల్లా పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తులు కేంద్రాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ గద్దె దిగడానికి కొన్ని నెలల ముందు సీనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడు కొందరు మహిళలు ఆయనను కలిశారన్నారు. ఆ సమయంలో వాళ్లు ఆయన కాళ్లు మొక్కారని చెప్పుకొచ్చారు. 
 
వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారని తాను ఎన్టీఆర్‌ను అడిగానని.. అందుకు ఆయన అదంతా వారి ప్రేమ, అభిమానం అని సమాధానం ఇచ్చారని వెంకయ్య చెప్పారు. అది అభిమానం కాదని అప్పట్లో ఆయనకు చెప్పానని.. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత జరిగిన వెన్నుపోటు వ్యవహారంలో ఆయన కాళ్లు మొక్కిన ఆ ఆరుగురు మహిళలే ముందున్నారని వెల్లడించారు. అయితే ఆ మహిళలు ఎవరు అనే విషయాన్ని మాత్రం తాను చెప్పబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అంశంపై కొంతకాలం క్రితం వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. దీంతో ఈ అంశంపై ఎన్నుడూ లేని విధంగా  బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబు వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments