Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (15:01 IST)
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈ దంపతులు సీఎం బాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఏపీ ప్రభుత్వం తితిదే పాలక మండలి సభ్యురాలిగా నియమించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చి సీఎంను కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆదివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ, ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా తన భర్త వెంట అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments