సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (15:01 IST)
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈ దంపతులు సీఎం బాబుకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఏపీ ప్రభుత్వం తితిదే పాలక మండలి సభ్యురాలిగా నియమించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో వచ్చి సీఎంను కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆదివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కానీ, ఆయనకు పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడంతో ఆయన అలిగి వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రశాంతి రెడ్డి కూడా తన భర్త వెంట అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments