Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపను కొడతామన్నారు... వివేకా హత్యపై అనుమానాలు... పద్మ డిమాండ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:29 IST)
వైయస్ వివేకానంద రెడ్డి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని వైకాపా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించినప్పుడే... ఈ మహా కుట్రకు బీజం పడిందని ఆమె ఆరోపించడం జరిగింది. 
 
కడపను కొడతామనీ, పులివెందులను గెలుస్తామనీ తెదేపా నేతలు పదేపదే చెప్పారనీ, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి  ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు.
 
వివేకానంద రెడ్డి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరిన వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదనీ, అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments