Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలు : వంగలపూడి అనిత

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రేటును నిర్ణయించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ మండిపడ్డారు. 
 
పైగా, రాష్ట్రానికి హోం మంత్రిగా సుచరిత ఉన్నారని, ఆమె ఆడపిల్లల అత్యాచారాలపై నోరు మెదపకుండా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఒకవేళ బయటకు వస్తే ఈ ప్రభుత్వం తరపున ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలు, ప్రాణానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమల్లో లేని దిశా చట్టం గురించి ప్రచారం చేసుకోవడం ఒక్క ఏపీ సర్కారుకే చెల్లిందన్నారు. 
 
ఆడపిల్లలకు న్యాయం చేయలేక పోతే హోం మంత్రి సుచరితతో పాటు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు తక్షణం తమతమ పదవులకు రాజీనామా చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments