Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (13:36 IST)
అడవుల్లో ఉండాల్సిన గజరాజులు ఊళ్లలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నానా బీభత్సం సృష్టించడమేకాకుండా, తనకు అడ్డొచ్చిన వారిని తొండంతో చుట్టి నేలకేసికొడుతుంది. కాళ్లతో తొక్కి చంపేసింది. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ మదపుటేనుగు గ్రామంలోకి దూసుకొచ్చింది. జనం మీద పడింది. తరిమి తరిమి కొట్టింది. దొరికిన ఓ వ్యక్తిని కాలుకింద నలిపేసి చంపేసింది. ఆ ఏనుగు బీభత్సం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం గజగజా వణికిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆగమేఘాలపై గ్రామానికి వచ్చారు. మదపుటేనుగును అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఏనుగు వేట ప్రారంభించారు. మొత్తానికి దాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. 
 
ఏనుగుకు మత్తుమందు ఇవ్వడంతో మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తాళ్లతో కట్టి.. తమ వాహనంలో మరో చోటకు తరలించారు. అక్కడ నుంచి ఏనుగుల శిబిరంలో దానిని వదిలేస్తామని… దాని ప్రవర్తనను గమనించి తర్వాత చర్యలు తీసుకుంటామని హరిద్వార్ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments