Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై మంత్రి ఉషశ్రీ హల్చల్... 50 మందితో దర్శనం

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (12:42 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం సాధారణ భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. కానీ, అధికార వైకాపా నేతలు మాత్రం కొండపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ భక్తులతో తమకెలాంటి సంబంధం లేనట్టుగా, వారు పడే కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల కొండపై హల్చల్ సృష్టించారు. 
 
ఆమె ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టిక్కెట్లు పొందారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి తితిదే అధికారులు టిక్కెట్లను జారీచేశారని భక్తులు మండిపడుతున్నారు. పైగా, ఈ విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వీడియో జర్నలిస్టులను కిందకు తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ కనీసం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 92 వేల మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments