Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై మంత్రి ఉషశ్రీ హల్చల్... 50 మందితో దర్శనం

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (12:42 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం సాధారణ భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. కానీ, అధికార వైకాపా నేతలు మాత్రం కొండపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ భక్తులతో తమకెలాంటి సంబంధం లేనట్టుగా, వారు పడే కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల కొండపై హల్చల్ సృష్టించారు. 
 
ఆమె ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టిక్కెట్లు పొందారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి తితిదే అధికారులు టిక్కెట్లను జారీచేశారని భక్తులు మండిపడుతున్నారు. పైగా, ఈ విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వీడియో జర్నలిస్టులను కిందకు తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ కనీసం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 92 వేల మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments