Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహన మిత్ర లబ్దికి 6 వరకు దరఖాస్తులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (09:02 IST)
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరానికి గానూ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ అన్నదమ్ముల సౌకర్యార్థం 6 జులై, 2021 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసామని రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని తెలిపారు. 
 
2021-22 సంవత్సరానికి గానూ 15 జూన్, 2021న 2,48,468 మంది వాహనదారులకు రూ.249 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి అందజేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే కాలాన్ని 6 జులై, 2021 వరకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములు మిగిలిపోయి ఉంటే 6 జులై, 2021 వరకు తమ తమ పరిధిలోని గ్రామ /వార్డు సచివాలయాల్లో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకొని వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments