Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం ఖాయం : కేంద్ర మంత్రి ఠాగూర్

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం మొగ్గు చూపిందని వెల్లడించారు. 
 
విశాఖలో ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై స్పందిస్తూ.. కొన్ని కం పెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత మెరుగైన ఫలితాలొచ్చాయని, ఉద్యోగుల వేతనాలు కూడా పెరిగాయన్నారు.నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. 
 
'ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. ఏ కంపెనీకి సాయం అందిస్తే బలోపేతమవుతుందో అంచనా వేస్తుంది. కంపెనీలన్నీ అమ్మకానికి పెట్టడం లేదు' అని చెప్పారు. 
 
ఇకపోతే, పెట్రో ధరల తగ్గింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని తేల్చి చెప్పారు. కేంద్రం చేయాల్సిందంతా చేసిందని, ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా తగ్గించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి పెట్రో ధరల్లో మార్పులుంటాయని చెప్పారు. అందువల్ల ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments