Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం.. రాజీనామాలకు గంట పిలుపు

Advertiesment
TDP MLA Ganta Srinivasa Rao
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి రాష్ట్రంలో కలకలం రేపాయి. దీనిపై తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం అవుతుందనే వార్త యావత్‌ రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసిందన్నారు. 
 
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరంకాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. 'రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవని కుంటిసాకు చూపి ప్లాంట్‌ని వంద శాతం ప్రైవేటుపరం చేయడం దారుణం. 
 
ఈ విషయంలో కేంద్రం ఆలోచన సరైంది కాదు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నందున.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలి. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి' అని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కుపై ఏ1 - ఏ2ల కన్నుపడింది : సీహెచ్ అయ్యన్నపాత్రుడు