Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అప్పు రూ.3.98 లక్షల కోట్లు

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.  
 
ఏపీ అప్పుల భారం ప్రతి యేటా పెరుగుతుందని కేంద్రం తెలిపింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా, ఇపుడు ఇది రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 
 
గత 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, 2020-21 నాటికి రూ.17.1శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని వెల్లడించింది. గత 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శతాంగా ఆ తర్వాత ఇది తగ్గిందని తెలిపారు. 
 
అదేవిధంగా 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, అదే 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments