Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్షీరాం ఆదర్శం : పవన్‌కు ఉండవల్లి సలహా

Webdunia
సోమవారం, 27 మే 2019 (18:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సలహా ఇచ్చారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం కూడా ఎదుర్కొన్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అందువల్ల పవన్ కూడా ఇపుడు అధైర్యపడాల్సిన అవసరం లేదనీ, ముఖ్యంగా ఈ ఓటమితోనే నైరాశ్యం చెందాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. 
 
ఉండవల్లి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చెప్పారు. అందువల్ల పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా గెలుస్తాడనీ అసెంబ్లీలో అడుగుపెడతాడని తాను భావించానని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని గుర్తుచేశారు. 
 
ఏదేమైనా కాన్షీరాం పేరు ఎక్కువగా చెబుతుంటారు కాబట్టి ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాన్షీరాం కూడా మొట్టమొదట నిలబడినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. కానీ వదిలిపెట్టకుండా కాన్షీరాం ముందుకు నడిచి ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతస్థాయిలో ఆయన పార్టీని నిలబెట్టగలిగారు. కాబట్టి, ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయమని చెప్పారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments