Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అనతికాలంలోనే ప్రత్యేక హోదా.. ముఖ్యమంత్రి జగనే.. వేద పండితులు

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (10:33 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

‘మీకు, మీ కుటుంబసభ్యులందరికి శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇంకా ఉగాదిని పురస్కరించుకుని శనివారం ఉదయం అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పండితులు, ఈ వికారి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న అంశంపై పండితులు విశ్లేషించారు. వైసీపీకి అధికారం లభిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పండితులు చెప్పారు. అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానుందని వేద పండితులు పంచాంగశ్రవణంలో జోస్యం చెప్పారు.
 
వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని చెప్పారు. జగన్‌కు అన్ని గ్రహాలూ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఆయన సుస్థిరమైన పాలన అందిస్తారని అంచనా వేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వేదాశీర్వచనం చేసి, నూతన పట్టు వస్త్రాలను పండితులు అందించారు. ఆపై జగన్ వారిని సత్కరించి, తాంబూలాన్ని అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments