Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ-విజయవాడ మధ్య ఉదయ్ పరుగులు

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:45 IST)
విశాఖ, విజయవాడ మధ్య రైల్వే ప్రయాణికులకు సేవలందించే ఉదయ్ ఎక్స్​ప్రెస్​ను కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ సి.అంగడి విశాఖలో ప్రారంభించారు.

ఈ ఎక్స్​ప్రెస్​తో విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయని మంత్రి స్పష్టంచేశారు. విశాఖలో ఉదయ్ ఎక్స్​ప్రెస్​ను రైల్వేసహాయ మంత్రి సురేష్ సి. అంగడి ప్రారంభించారు. ఈ ఎక్స్​ప్రెస్ రోజూ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు విశాఖ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంటుంది.

అనంతరం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విజయవాడ నుంచి విశాఖ బయల్దేరుతుంది. ఈ రెండు నగరాల మధ్య వారానికి 5 రోజుల పాటు సేవలనందించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయి ఉదయ్ ఎక్స్​ప్రెస్​తో విశాఖ వాసుల కష్టాలు తీరనున్నాయని కేంద్ర మంత్రి సురేష్ సి. అండగి వ్యాఖ్యనించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేరుకుందని స్పష్టం చేసిన ఆయన...విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు.

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైల్వేల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments