Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో రోడ్డు ప్రమాదం - తెదేపా నేతల దుర్మరణం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:54 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాష్ రెడ్డి, గంగపల్లి భాస్కర్‌గా గుర్తించారు. మరో నేత సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా పరిధిలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చంద్రగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్‌లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఐటీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్ర  దిగ్భ్రాంతికి గురిచేసిందని, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments