Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాపులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై అర్థరాత్రి కాల్పులు

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (08:54 IST)
కోనసీమ జిల్లా రావులపాలంలో అర్థరాత్రి కలకలం చెలరేగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వారిని వ్యాపారి కుమారుడు ప్రతిఘటించాడు. అయినప్పటికీ వారు కాల్పులు జరపడంతో బాధితులు పెద్దగా కేకలు వేశారు. దీంతో దండుగులు అక్కడ నుంచి పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రావులపాలెంలో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బడా ఫైనాన్స్ వ్యాపారిగా చెలామణి అవుతున్నాడు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి కాల్పులకు తెగబడ్డారు. తొలుత ఆయనపై దుండగులు కాల్పులు జరుపగా, ఆ తర్వాత సత్యనారాయణ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు. 
 
దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో ఓ దండుగుడి చేతి సంచి కిందపడిపోయింది. దీన్ని పరిశీలించగా, అందులో రెండు నాటు బాంబులు, జామర్‌లు ఉన్నాయి. ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments