Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (19:55 IST)
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్య పేట  సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు ఆటో డ్రైవర్ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆటోలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని  స్థానికుల సహకారంతో గాయపడ్డవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయిప్రదీప్ కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments