Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తింటున్న బాలుడి గొంతులో చిక్కుకున్న ముక్క.. చివరికి?

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (17:38 IST)
చిన్నపిల్లలకు మాంసాహారం ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలి. చేపలు కానీ, చికెన్ వంటివి పిల్లలకు పెడుతున్నప్పుడు.. అందులోని ముల్లు, ముక్కలను తొలగించి ఇవ్వడం చేస్తే పిల్లల గొంతులో అవి చిక్కుకుపోవు. తాజాగా ఓ బాలుడు ఇలా చికెన్ ముక్కను కొరుకుతూ వుండగా.. చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. కానీ వైద్యులు చాకచక్యంగా బాలుడు గొంతులో ఇరుక్కున్న చికెన్ ఎముక ముక్కను తొలిగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. లింగంపల్లికి చెందిన పదేళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం చికెన్ తింటుండగా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆహార నాళంలో ఇది అడ్డంగా ఇరుక్కుపోవడంతో బాలుడు బాధతో నానా తంటాలు పడ్డాడు. ఆపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఆ బాలుడికి చికిత్స చేశారు. పరీక్షల అనంతరం చాకచక్యంగా వ్యవహరించి గొంతులో ఇరుక్కున్న ఎముక ముక్కను వైద్యులు తొలగించారు. రెండు రోజుల తర్వాత ఈ చికెన్ ముక్కను బాలుడి గొంతు నుంచి తొలగించినట్లు వైద్యులు తెలిపారు. 
 
అనంతరం పలు పరీక్షల ద్వారా ఆహార నాళం మామూలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటి కేసుల్లో నాళంలో ఇరుక్కున్న ఎముకను త్వరగా తీయకుంటే నాళానికి రంధ్రం ఏర్పడే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. అందుచేత చిన్నారులకు మాంసాహారం అందించే పక్షంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని వైద్యులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments