Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారుల మృతి.. ఆ పండ్లను కడగకుండా..?

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (12:58 IST)
Black Jamun
నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది.

వివరాల్లోకి వెళితే..  కోసగి మూడో వార్డులో నాలుగు  రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. 
 
కొన్ని పండ్లను చిన్నారుల తల్లి మాదేవి కూడా తింది. కానీ నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని కుటుంబీకులు ఆదోనీ ఆస్పత్రికి తరలించారు. కానీ నేరేడు పండ్లను తిన్న రోజే హర్ష అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు.

మంగళవారం అస్వస్థతకు గురైన చిన్నారుల్లో అంజి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నేరేడు పండ్లు తిని మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది.
 
క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్‌లో నేరేడుపండ్లు తీసుకురాగా, ఆ పండ్లను కడగకుండా అలాగే తినడంతోనే ఇలా అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

బాధితుల శరీరంలోకి పాయిజన్ వెళ్లి వుంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఎవరైనా పండ్లు తినేటప్పుడు నీటితో శుభ్రంగా కడుక్కుని తినాలని సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments