Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు చిన్నారులను మింగేసిన చెరువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (13:36 IST)
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్ (9), కార్తీక్ (8) అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిద్దరూ తమ దస్తులను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఈత కొట్టేందుకు గట్టుపై నుంచి నీటిలో దూకారు. అంతే.. వారిద్దరూ వెళ్లి చెరువు ఊబిలో చిక్కుకునిపోయారు. 
 
అయితే, ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్ళిన పిల్లలు చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు వద్ద పిల్లల దుస్తులు కనిపించడంతో నీటిలో గాలించారు. ఈ గాలింపు చర్యల్లో ప్రవీణ్ మృతదేహం లభ్యంకాగా, కార్తీక్‌ను ఆస్పత్రికి తరలించే మార్గంలోనే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments